హైదరాబాద్ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భాగ్యనగరం సింగిల్ స్టాప్ డెస్టినేషన్గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్ సిటీలో జాన్సన్ కంట్రోల్కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్ హైదరాబాద్లో ఉందని.. ఇమేజ్ టవర్స్ను సైతం నిర్మిస్తున్నామని చెప్పారు. మనదేశంలో కార్యకలాపాలు విస్తరించిన జాన్సన్ కంట్రోల్.. ఓపెన్ ఇన్నోవేషన్ సెంటర్లో ఇంట్రూజన్, యాక్సెస్ కంట్రోల్, వీడియో సర్వైలెన్స్ ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు.