కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసి కాలనీలో ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక సమస్యలపై పాదయాత్ర చేయగా.. మిగిలిన సీసీ రోడ్లు, చిల్డ్రన్స్ పార్క్ వద్ద కాంపౌండ్ వాల్, మొక్కల పెంపకం, సీనియర్ సిటిజన్స్ కల్చరల్ బిల్డింగ్, సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్, చిల్డ్రన్స్ పార్క్ లో పిల్లల ఆట సామగ్రి, లైబ్రరీ ఏర్పాటు వంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలిచ్చారు. గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఇప్పటికే స్పోర్ట్స్ థీమ్ పార్క్ ప్రారంభించడం జరిగిందని, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులు కూడా ప్రారంభమవడం ఎంతో సంతోషకరం అన్నారు.
త్వరలోనే మిగిలిన పనులన్నీ పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈఈ శిరీష, డీజీఎం అప్పల నాయుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేతి రాజా, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, కాలనీ జనరల్ సెక్రెటరీ గిరిధర్, అడ్వైజర్ దేవేందర్ రెడ్డి, మూర్తి, సాయి బాబా, ముకుంద్ రావు, రోషన్, రెహ్మాన్, సదర్, అఖిల్, అన్వర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.