Home / SLIDER / సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం

సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో దళితబంధు కింద 43 మందికి ట్రాక్టర్లు, ఐదుగురికి కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు.

ఐనోల్‌ గ్రామంలో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తానని తెలిపారు. మద్దిమడుగు ఆలయంలో గిరిజన సత్రం నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు.

అనంతరం జీబీఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోచింగ్‌ సెంటర్‌ను సందర్శించారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ఎంతో ఖర్చుతో కోచింగ్‌ ఇప్పించడం, మెటీరియల్‌, భోజన వసతి కల్పించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat