తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. RRR మంచి హిట్ అందించడంతో జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఆ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. దీంతో చెర్రీ దానికి తగ్గట్టుగానే తాజా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అతడి తాజా చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెద్ద నిర్మాత. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దిల్ రాజు తన ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఇది 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది.
ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ సాధించి.. తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ. అందుకు తగ్గరీతిలో ఈ సినిమాలోని పాత్రకోసం కష్టపడుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, జయరామ్, శ్రీకాంత్, యస్.జే.సూర్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సాధారణంగా దర్శకుడు శంకర్.. తన చిత్రాలు మాస్ కంటెంట్ తో ఉన్నప్పటికీ.. వాటికి క్లాసీ టైటిల్స్ పెట్టడంలో ఆసక్తి చూపిస్తుంటాడు.
సరిగ్గా RC 15 చిత్రానికి కూడా అదే సూత్రం అప్లై చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సినిమా మొదలైన కొత్తలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ‘సర్కారోడు’ అనే మరో టైటిల్ కూడా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ‘అధికారి’ అనే మరో టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టింది. ఇప్పుడు కొత్తగా ‘ఆఫీసర్’ అనే టైటిల్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో..?