Home / NATIONAL / దేశంలో కరోనా కలవరం

దేశంలో కరోనా కలవరం

దేశంలో గత రెండు వారాలుగా  కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు.

తాజాగా నేడు శుక్రవారం  కొత్తగా 17,336 కరోనా  పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్  బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు 5,24,954 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. మరో 88,284 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో 13 మంది కరోనాతో మరణించారు. 13,029 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat