ఒక పక్క అందం, మరోవైపు చక్కని అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్ భామ ‘ధోని-ది అన్టోల్డ్ స్టోరీ’, ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్ థ్రిల్లర్ ‘భూల్భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. దాదాపు నాలుగు రోజులు గదిలోనే ఉండిపోయాం. నీళ్లు కూడా లేవు. వేడికోసం వేసిన క్యాంప్ ఫైర్ సైతం ఆరిపోయింది. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. మంచం పక్కనే ఉన్న కుర్చీకి మంట అంటుకుంది.
సమయానికి మా ఫ్రెండ్ చూసింది కాబట్టి సరిపోయింది. వెంటనే మంటలు ఆర్పేసింది. గదినిండా పొగ.. ఎటూ వెళ్లడానికి లేదు. చావు ఖాయమనుకున్నా. మేం గట్టిగా అరవడంతో పక్క రూంలోని వాళ్లు తలుపులు పగులగొట్టారు. అప్పడే, ప్రాణం విలువ తెలిసొచ్చింది. ఆ సంఘటన తర్వాత నా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది అని చెప్పుకోచ్చింది.