తెలుగు సినిమా రంగంలో హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట మంచి గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో లవ్లో ఉన్న ఈ జంట.. 2009లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ స్పందించారు. ఇన్స్టాలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవాలేనని తెలిపింది.
‘‘నేను పాడిన పాటల కంటే ఇలాంటి అనవసర, అప్రస్తుత, పనికిరాని సమాచారం ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది’’ అని హేమచంద్ర పోస్ట్ చేయగా.. ‘‘గడిచిన కొన్ని రోజుల నుంచి నా యూట్యూబ్ ఛానల్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. సాధారణం కంటే ఇప్పుడు ఎక్కువ పని, సంపాదన ఉంటోంది. తప్పో ఒప్పో కానీ మీడియా నాకో వరం’’ అని శ్రావణ భార్గవి పేర్కొన్నారు. దీంతో గత కొద్దిరోజులుగా వీళ్ల విడాకులపై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.