హైదరాబాద్లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు.
పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే అని.. ఇది అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ కొత్త ప్రారంభానికి తెలంగాణకు మించి ప్రదేశం మరొకటి లేదని.. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పథకాలు, సుపరిపాలనపై అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు.