Home / SLIDER / మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…

మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…

ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 20 లక్షలతో శ్రీ మార్కండేయ స్వామి ఆలయా నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు.

యాదద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కెసిఆర్ గారికే దక్కిందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి గారు మన జిల్లాకు ఉండటం మన అదృష్టం అని అన్నారు. వారు మన జిల్లా లోనీ ఆలయాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత కల్పించారు అని అన్నారు.

అనంతరం ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే గారినీ శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat