Home / POLITICS / కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా

కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా

దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ వచ్చిన యశ్వంత్‌ సిన్హా.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం ఇది అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌కు యశ్వంత్‌సిన్హా ధన్యవాదాలు తెలిపారు.

విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదని.. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా? అని ప్రశ్నించారు. దేశానికి కేసీఆర్‌లాంటి నేత అవసరమని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat