ఈ నెల 4న తన జన్మదినం సందర్భంగా తాను తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వేడుకలు చేయవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. వేడుకలకు బదులుగా , ఎవరికి వారుగా మొక్కలు నాటాలని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన జన జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.పుట్టిన రోజు అందరికీ పండుగే.
కానీ, *నేను నా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా నా వేడుకలు జరపాల్సిన పని లేదు. నా నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే* అన్నారు. *మీ ఆశిస్సులివ్వండి చాలు.* అని మంత్రి దయాకర్ రావు అన్నారు.
*తన జన్మదిన వేడుకలకు బదులుగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కని నాటాలి. వాటిని మొక్కవోని దీక్షతో సంరక్షించాలి. మన సీఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మనమంతా కలిసి హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొందామని మంత్రి పిలుపునిచ్చారు.* తద్వారా *వాతావరణ సమతౌల్యానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి పాటు పడదామని మంత్రి ఎర్రబెల్లి ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి* చేశారు. మళ్ళీ కరోనా పొడ చూపుతున్నO దున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.