కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తుపాకీతో కాల్చేస్తాని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి సతీమణి ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన జార్జిని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేయడం వెనుక సీఎం విజయన్ హస్తం ఉంది.
అందుకే ఆయనను తుపాకీతో కాల్చేస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక ఆరోపణల కేసులో జార్జిని మొన్న శనివారం పోలీసులు అరెస్టు చేశారు.. అనంతరం బెయిల్పై విడిచిపెట్టారు. అయితే జార్జి అరెస్టు అనంతరం ఆయన భార్య ఉషా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం విజయన్ తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ‘‘ఇదొక తప్పుడు కేసు. కేరళ సీఎం విజయన్ నా భర్తను, మా కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.