TRS ఎమ్మెల్సీ కవిత కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి కార్యకర్తలు లోతట్టు ప్రాంత ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.వర్షపు నీరు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు.
అలాగే కేసీఆర్ బువ్వకుండా ద్వారా వారి ఆకలిని తీర్చారు. నగరంలోని ధర్మపురి కాలనీ నాగారం, రైల్వే స్టేషన్ బస్టాండ్లలో పలువురికి భోజనాన్ని అందించారు. గత ఏడు కూడా భారీ వరదల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న గూపన్పల్లి వాగు పరివాహక ప్రాంత వాసులను కవిత ఆదుకున్నారు.
వారి ఆకలిని తీర్చడంతోపాటు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. ఈసారి కూడా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అవసరం ఉన్నచోట జాగృతి కార్యకర్తలు, నాయకుల ద్వారా ఎప్పటి కప్పుడు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.