తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సరికొత్త మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీతో హిట్ ను అందుకున్న మోస్ట్ గ్లామరస్ తార రాశీఖన్నా , అవికాగోర్, మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మాతగా… మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీత దర్శకుడుగా… బీవీఎస్ రవి కథనందించారు. లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు సినీ ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. థ్యాంక్యూ ప్రపంచవ్యాప్తంగా జులై 22న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ అదేంటంటే మహేశ్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడట చైతూ. చైతూ స్కూల్ డేస్లో మహేశ్ అభిమానిగా కనిపించనున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మొత్తానికి ఈ వార్త అఫీషియల్ కాకపోయినప్పటికీ అప్డేట్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్.