ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి గ్రాఫ్పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు.
తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన సర్వే ఇది అని చెప్పారు. వైసీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదనే విషయం తెలిసిపోయిందన్నారు. జగన్ అంటే ఏంటో ప్రజలకు బాగా తెలుసని.. ఇలాంటి సర్వేలు జగన్ను ఏమీ చేయలేవని పేర్ని నాని అన్నారు. తన జీతగాళ్లతో దొంగసర్వేలు చేయించుకుని ఆనందపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.