అప్పుడేప్పుడో విడుదలైన ‘గోదావరి’తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అలనాటి నటి నీతూ చంద్ర. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తనను కావాలనే కొందరు దూరం పెడుతున్నట్లు ఆరోపించింది.
ఛాన్స్లు రాకపోవడంతో సూసైడ్ చేసుకోవాలని అనిపించిందని తెలిపింది. ఓ వ్యాపారవేత్త తనకు భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని చెప్పింది. తాను హాలీవుడ్ కు ఎంపిక కావడం కొందరు జీర్ణించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.