తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 68 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎస్, రెస్క్యూ బృందాలు సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలిస్తున్నారు.
వరద బాధితులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి.