Home / ANDHRAPRADESH / త్వరలో సీఎం జగన్‌ ‘ప్రజాదర్బార్‌’

త్వరలో సీఎం జగన్‌ ‘ప్రజాదర్బార్‌’

త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్‌ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్‌’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. శని, ఆదివారాల్లో ప్రజాదర్బార్‌ ఉండదు. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయం మాత్రం తెలియరాలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat