దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో విపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘చట్టం ముందు అందరూ సమానమా? కాదా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ (సోనియా గాంధీ) ఏమైనా సూపర్ హ్యూమనా? వారు (కాంగ్రెస్) చట్టానికి అతీతం అని భావిస్తున్నారా?’ అని ఎంపీలపై మండిపడ్డారు.