ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ప్రసారమై ‘కాఫీ విత్ కరణ్’ షోలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడనుంది?.. గతంలో విడాకులు తీసుకున్న తన మాజీ భర్త ..టాలీవుడ్ యంగ్ హీరో .. అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఉన్న ప్రస్తుత సంబంధం గురించి ఏం చెబుతోంది అన్న ఆసక్తితో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎపిసోడ్ రానే వచ్చింది. హీరోయిన్ సమంత,హీరో అక్షయ్ కుమార్ అతిథులుగా హాజరైన ఈ ఎపిసోడ్ నిన్న గురువారం రాత్రి స్ర్టీమింగ్ అయింది.
‘ చైతన్యతో విడాకుల తర్వాత పరిస్థితి, ట్రోలింగ్ గురించి కరణ్తో చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా సమాధానమిచ్చారు. మాటల మధ్యలో ‘నీ భర్త’ అని కరణ్ అనగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా ‘మాజీ భర్త’ అని సమంత కరణ్ మాటను సరిచేసింది అమ్మడు. ప్రస్తుతం చైతూ, సమంత మధ్య ఎటువంటి రిలేషన్ ఉందన్న కరణ్ ప్రశ్నకు ‘‘మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. ఆ గదిలో కత్తులు లాంటి వస్తువులను దాచేయాలి.
మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో పరిస్థితి ఫ్రెండ్లీగా ఉంటుందేమో చెప్పలేను. ప్రస్తుతానికి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే’’ అని సమంత చెప్పారు. విడాకుల అనంతరం 250 కోట్లు భరణం తీసుకున్నాననీ, పెళ్లికి ముందు అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల భరణం రాలేదని ఇలా.. ఏవేవో రాతలు, ట్రోలింగ్ చూశాను. నేను చదివిన గాసిప్పులో ఇవే చెత్తవి. విడాకుల వల్ల నేనేమీ అప్సెట్ కాలేదు’’ అని సామ్ చెప్పుకొచ్చారు