తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ఓటరుకార్డును ఆధార్ కు అనుసంధానం చేయిస్తూ.. వివరాలు వెల్లడి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు ఒకటో తారీఖు నుండి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు చెప్పారు.