ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా..
రేణురాజ్ కేరళలోని అలప్పుఝ కలెక్టర్గా పనిచేశారు. శ్రీరామ్ వెంకట్రామన్ కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె భర్త శ్రీరామ్ను కొత్త కలెక్టర్గా నియమించింది. దీంతో ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశా.. ఇప్పుడిక మీ వంతు.. జాగ్రత్తగా చూసుకోండి.. అని భర్తకు జిల్లాను అప్పగించింది భార్య.