Home / SLIDER / ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్‌ విడుదల

ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్‌ విడుదల

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతివేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింగళి రూపొందించిన ఒరిజనల్‌ జెండాను ఆరోజున ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు.

ఇవాళ పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందర్శిస్తున్నానని వివరించారు.శత జయంతి వేడుకలకు పింగళి సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, పింగళి పేరిట తపాల స్టాంప్‌ను కూడా విడుదల చేయనున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా పింగళి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ, అమిత్‌ షా సన్మానిస్తారని ఆయన వివరించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా పేరిట వేడుకలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat