దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు.
తాజాగా మోదీ తన అన్ని సోషల్ మీడియా ఎకౌంట్ల డీపీలను మార్చారు. ఇదే విషయాన్ని ప్రధాని తెలుపుతూ త్రివర్ణ పతకాన్ని నా డీపీగా పెట్టుకున్నాను. మీరు కూడా డీపీ మార్చాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, భాజపా నేతలు తమ ఖాతాల డీపీలు మార్చారు. ఇదే కాకుండా ఈనెల 13 నుంచి 15 వరకు ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగరేయాలని సూచించారు.