Home / ANDHRAPRADESH / ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల

ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల

ఏపీ ఈసెట్-2022 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం మంది పాసయ్యారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత మండలి ఛైర్మన్‌ ప్రొ. కే హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.

జులై 22న ఆన్‌లైన్‌ పద్థతిలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 37 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే తక్కవ దరఖాస్తులు రావడం వల్ల 14 విభాగాల్లో జరగాల్సిన ఈ పరీక్ష 11విభాగాల్లో మాత్రమే జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat