Home / MOVIES / ‘మహానటి’లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్‌

‘మహానటి’లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్‌

అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొంది సూపర్‌ సక్సెస్‌ అయిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్‌ పోషించారు. ఈ మూవీలో పాతతరం నటుల పాత్రలో చాలా మంది నటించారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్‌ పాత్రలతో కీర్తిసురేష్‌నటించే సీన్లు ఉన్నాయి.

నాగేశ్వరరావు పాత్రకు ఆయన మనవడు నాగచైతన్యను తీసుకోగా.. సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. కావాలనే జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకోలేదనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. లేటెస్ట్‌గా దీనిపై నిర్మాత అశ్వనీదత్‌ వివరణ ఇచ్చారు.

సీనియర్‌ ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయించాలని అనుకున్నామని.. ఈ ఆలోచన అందరికీ నచ్చిందని చెప్పారు. అయితే అప్పటికే బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ ప్రకటించడంతో తమ సినిమాలో ఎవర్ని పెట్టినా తప్పుగా భావిస్తారేమో అనిపించింది. ఒకవేళ ఎన్టీఆర్‌ను పెట్టి తీసినా బాగుండదేమోనని అనుకున్నామని.. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి చెప్తే ఎన్టీఆర్‌ పాత్రే లేకుండా చేద్దామన్నారు. అనుకున్నట్లుగానే పాము పట్టుకునే సీన్‌ను గ్రాఫిక్స్‌ సాయంతో మేనేజ్‌చేశామని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat