Home / SLIDER / ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని  ఎద్దేవాచేశారు.సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్‌.. నిర్దేశించుకొన్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి మోదీకి లేదన్నారు.

రాబోయే పాతికేండ్లకు కొత్త లక్ష్యాలు నిర్దేశించడం వినడానికి బాగున్నదే కానీ.. ఇప్పటివరకు సాధిస్తామని చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.’ఎర్రకోట వేదికగా 2047 కోసం ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొన్ని కొత్త లక్ష్యాలపై మాట్లాడం వినడానికి ఎంతో బాగున్నది. కానీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్న సంగతిని మోదీ ఇప్పటికైనా గుర్తించాలి. 2014లో 2022 నాటికి దేశ రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్‌, ప్రతి భారతీయుడికీ సొంత ఇల్లు కట్టిస్తామనడంతోపాటు.. 2018లో మన ఆర్థిక వ్యవస్థను 2022 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్లుగా మారుస్తానన్న హామీల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘లక్ష్యాల సాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్తవాటి గురించి చెప్తే విశ్వసనీయత ఏముంటుంది? మీ లక్ష్యాలను మీరే గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎకడ ఉంటుంది’ అని ప్రశ్నించారు. ప్రధాని గతంలో చేసిన వాగ్దానాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారంటూ.. క్యా హువా తేరా వాదా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా మోదీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat