Home / MOVIES / ‘లైగర్‌’ ఇంటర్వ్యూలో బాగా ఏడ్చేసిన ఛార్మి

‘లైగర్‌’ ఇంటర్వ్యూలో బాగా ఏడ్చేసిన ఛార్మి

రౌడీ విజయ్‌దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందించిన మూవీ ‘లైగర్‌’. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాగ్రౌండ్‌తో రెడీ అయిన ఈ సినిమా ఈనెల 25న రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అటు బాలీవుడ్‌, ఇటు సౌత్‌లో ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి.. సినిమా షూటింగ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

విజయ్‌కు 2019 ఆగస్ట్‌లో ‘లైగర్‌’ కథ చెప్పామని.. ఆ తర్వాత కొవిడ్‌.. వరుస లాక్‌డౌన్‌లు వచ్చాయని ఛార్మి గుర్తు చేశారు. ఆ కష్టకాలంలో ఫైనాన్షియల్‌గా చాలా ఛాలెంజెస్ వచ్చాయన్నారు. జేబులో రూపాయి కూడా లేదని చెప్పారు. సినిమాను ఓటీటీలో అమ్మేందుకు భారీ ఆఫర్‌ వచ్చిందన్నారు.

అంతటి ఆఫర్‌ను కూడా రిజెక్ట్‌ చేశామని.. అలా చేయడానికి దమ్ము కావాలన్నారు. ఆ దమ్ము పూరీ జగన్నాథ్‌ది అని చెప్పారు. థియేటర్‌లో రిలీజ్‌ అవ్వాల్సిన సినిమా ఇది అని ఆఫర్‌ను వదులుకున్నామన్నారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్‌ అండగా నిలబడ్డాడని చెప్పుకుంటూ ఛార్మీ ఏడ్చేశారు. ఆయనే తమను ముందుండి నడిపాడని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat