Home / CRIME / అయ్యో.. ఏ కష్టమొచ్చిందో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు దండం పెట్టి మరీ..

అయ్యో.. ఏ కష్టమొచ్చిందో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు దండం పెట్టి మరీ..

ఆ వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య విగతజీవిగా మారాడు.

ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పట్టాలపైకి రావడాన్ని గుర్తించిన రైలు ఇంజిన్ లోకో పైలట్ సురేశ్‌బాబు హారన్ కొట్టినా ఆ వ్యక్తి పక్కకు తప్పుకోలేదు. మృతిడిని గుర్తించేందుకు అతడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతుడు పసుపు రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ వేసుకున్నాడు. అతడి వివరాలు తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat