మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
‘‘దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను.. ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్ధంగా ఉంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.