కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార ఘటన చుట్టూ తిరిగే కథాంశంతో సస్పెన్స్ ఎలిమెంట్స్ సాగుతుంది ట్రైలర్. అసలు హత్యాచారానికి గురైన ఆ మహిళ ఎవరు..ఇంతకీ ఆమెను బలితీసుకుంది ఎవరు..? అనే అంశాలపై ట్రైలర్లో సస్పెన్స్ లో పెడుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్.
అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది కథనందించగా..అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆహాలో ఆగస్టు 26న ప్రీమియర్ కానుంది.