ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా..
అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ముందు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టులో క్రికెటర్ ఫఖర్ జమాన్ చూపించిన క్రీడా స్ఫూర్తిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో టీమిండియా బౌలర్ అవేశ్ ఖాన్ వేసిన ఐదో బంతిని బ్యాట్స్ మెన్ ఫఖర్ జమాన్ మిస్ చేశాడు.
బౌన్స్ అవుతూ వచ్చిన ఆ షార్ట్ ఫిచ్ బంతి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చేతుల్లోకెళ్లింది. ఈ సమయంలో కార్తిక్ కూడా ఎలాంటి అప్పీల్ చేయలేదు. అయినా కానీ ఫఖర్ జమాన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అంపైర్ సిగ్నల్ వచ్చేవరకు కూడా ఆగకుండా వెంటనే క్రీజును వదిలి వెళ్లాడు. ఓవైపు తన సహచర బ్యాట్స్ మెన్ రిజ్వాన్ ఆలోచించాలని చెప్పినా వినకుండా ఫఖర్ వెళ్లిపోయాడు. రీప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ స్పైక్ వచ్చింది.