Home / SLIDER / మునుగోడు ఉప ఎన్నిక – బీజేపీకి షాక్

మునుగోడు ఉప ఎన్నిక – బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బిజెపి కి చుక్కెదురైంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను కాదని బిజెపి లో చేరిన చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు.

ఇప్పటికే కాంగ్రెస్,బిజెపి ల నుండి గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్న నేపద్యంలో తాజాగా జరిగిన దోనిపాముల పరిణామం బిజెపి కి మింగుడు పడకుండా చేసింది.ఈ మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో తాను తిరిగి మాతృసంస్థ టి ఆర్ యస్ లో చేరుతున్నట్లు సదరు సర్పంచ్ దేవేందర్ ప్రకటించారు.

కాగా పార్టీలో చేరిన సర్పంచ్ దేవేందర్ కు మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్హనించారు.ఈ కార్యక్రమంలో చండూరు జడ్ పి టి సి కర్నాటి వెంకటేశం, యం పి టి సి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat