Home / CRIME / తండ్రీకొడుకుల దారుణం.. ముక్కలు ముక్కలు చేసిన వైనం..!

తండ్రీకొడుకుల దారుణం.. ముక్కలు ముక్కలు చేసిన వైనం..!

సినిమాల్లో మంచిని గ్రహించి ఎంతమంది మారుతున్నారో తెలీదుగానీ చెడును మాత్రం స్ఫూర్తిగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన సొంత తల్లీ అని ఆ కన్నకొడుకు అనుకోలేదు.. నానమ్మ అని ఆ మనవడు అనుకోలేదు. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి ముక్కముక్కలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా తరహా అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని కేశవ్‌నగర్‌లో చోటుచేసుకుంది.

64 ఏళ్ల ఉషా విఠల్ గైక్వాడ్ దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేసేవారు. రిటైర్ అయిన తర్వాత ఆమె కేశవనగర్‌లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కొడుకు సందీప్ గైక్వాడ్, కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ కలిసి ఉంటున్నారు. అందరి ఇళ్లలో లాగే ఆ అత్తాకోడళ్లు కూడా తరచూ ఏదో ఒక విషయమై గొడవ పడేవారు. ఆగస్టు 5న కూడా గొడవ జరిగింది. దీంతో కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదే రోజు మధ్యాహ్నం ఉషా విఠల్ నిద్రపోతూ ఉండగా.. మనవడు సాహిల్ ఆమెను బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత శరీరాన్ని మాయం చేసేందుకు తండ్రీకొడుకులు చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్‌తో మృతదేహాన్ని 9 ముక్కలుగా చేసి సంచుల్లో కుక్కేశారు. వాటిని తీసుకెళ్లి ముథా నది నీటిలో పడేశారు. సమీపంలోని చెత్త డిపోలో మరో సంచి వదిలేశారు. రక్తంతో తడిసిన ఆమె బట్టలు, కటర్, నది ఒడ్డున పడేశారు. తర్వాత ఏం తెలీనట్లు వృద్ధురాలు కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. మృతురాలి కూతురు అన్న మీద అనుమానం ఉందని చెప్పగా.. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయటపడింది. ఆస్తి కోసమే ఇదంతా చేసినట్లు సాహిల్ అంగీకరించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat