ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం టీమ్ఇండియాను ఎంపిక చేసింది.
గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. విరామం లేని క్రికెట్తో బుమ్రాకు వెన్నెముక గాయం కాగా, హర్షల్ పటేల్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. మెగాటోర్నీ నాటికి ఈ ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్నెస్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందనున్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్(కెప్టెన్), రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, హార్దిక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్సింగ్. స్టాండ్బై: షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, చాహర్.