పాన్ ఇండియా స్టార్ హోదాలో ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. పెద్దనాన్న కృష్ణం రాజు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నాడు. కృష్ణం రాజును కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులకు అంత బాధలోనూ ఆప్యాయంగా పలకరించారు ప్రభాస్.
వచ్చిన వారందరికీ తప్పకుండా భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్ అంటూ చెప్పారు. ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మా అన్నకు మా మీద ఉన్న ఆప్యాయతే వేరు.. అన్న నువ్వు ఉన్న పరిస్థితి వేరు అయినా ప్రతి ఒక్క ఫ్యాన్కి అన్నం పెట్టావ్ నువ్వు చాలా గ్రేట్.. నువ్వు నిజంగా దేవుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.