డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్గా రానుంది. ఈ మూవీను పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్ డ్యూయల్ క్రొమాటిక్ టెక్నాలజీతో తెరకెక్కించనున్నారు.
దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కే మూవీకి వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. 2024లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు.