తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి రాకతో సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దసరా పండగ ముందుగా తలపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ గుర్తింపు కార్డులను అదేవిధంగా పేదంటి ఆడబిడ్డల పెళ్ళికానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా అందిస్తున్న కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి పెళ్లి కానుకగా చీరను, అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకున్నందుకుగాను ఆయన ఖర్చులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఆపత్కాలంలో వారికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారికి నారాయణపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీ బతుకమ్మలు పువ్వులతో పేర్చి, డీజే ఆటపాటలతో, గ్రామంలో మామిడాకులు, అరటి గెలల తోరణాలతో చూడముచ్చటగా దసరా పండగ ముందుగా వచ్చినట్టు గ్రామంలో వాతావరణం నెలకొంది.