తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ ..జూనియర్ ఎన్టీఆర్ ,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి మనందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ముందుగా దివంగత సినీయర్ నటి శ్రీదేవి తనయ ..హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. ఆ తరవాత నేషనల్ క్రష్ రష్మిక పేరు బయటకు వచ్చింది.
అక్కడతో ఆగకుండా ‘సీతారామం’లో సీతగా మెప్పించిన మృణాల్ ఠాకూర్కి ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పారు. అయితే.. వీళ్లెవరూ ఖాయం కాలేదని టాక్. ఇప్పుడు కొత్తగా కియారా అద్వాణీ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్తో కియారా జోడీ కట్టడం దాదాపు ఖాయం అన్నది లేటెస్ట్ టాక్.
ఇదే నిజమైతే.. ఎన్టీఆర్ – కియారాల కాంబోలో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. కొరటాల శివ ఇది వరకు తెరకెక్కించిన ‘భరత్ అనే నేను’లో కియారానే నాయిక. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి.