తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్కు రీమేక్గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ అతిధి పాత్రలో .. సత్యదేవ్, నయనతార కీలకపాత్రలుగా ఎస్ఎస్ థమన్ సంగీతాన్నందిస్తుండగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ‘గాడ్ఫాదర్’.
ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచాయి. మొహన్రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందట.
గాడ్ఫాదర్ మూవీ డిజిటల్ హక్కులు రూ.57కోట్లకు అమ్ముడయ్యాయట. తెలుగు, హిందీ వెర్షన్లను కలుపుకుని నెట్ఫ్లిక్స్ ఇంత భారీ మొత్తంలో ఓటీటీ రైట్స్ను కొనుగోలు చేసిందట. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో భాగమవడంతో అన్ని కోట్లకు డీల్ కుదిరించుకుందట. ఇక ఈ చిత్రానికి శాటిలైట్, ఆడియో హక్కుల రూపంలో మరో రూ.60కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. దీన్ని బట్టి చూస్తే కేవలం నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలోనే ఈ చిత్రానికి రూ.117 కోట్ల వరకు వచ్చాయి. ఇక ఈ సినిమా బిజినెస్ వాల్యూ కూడా దాదాపు రూ.90 కోట్లు ఉండనుందని సమాచారం.