యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక పట్ల కామాంధులు పశువుల్లా ప్రవర్తించారు. 15 ఏళ్ల బాలికను ఐదుగురు వివస్త్రను చేసి రేప్ చేశారు. మొరాదాబాద్లో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్క గ్రామంలో సంతకు వెళ్లిన బాలికను కామాంధులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
పక్కనే పొలాల్లో ఉన్న కొంతమంది బాధితురాలి కేకలు విని అటువైపు వెళ్లడంతో నిందితులు పారిపోయారు. వివస్త్రగా ఉన్న బాలిక అనంతరం నగ్నంగానే ఇంటికెళ్లింది. కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అయితే బాలిక బట్టల్లేకుండా వెళ్తుండగా ఓ మహిళ వీడియో తీసింది. అది వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.