Home / SLIDER / అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిది

అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిది

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. స్థానికులుగా ఉండి ఎవరైతే నిరుపేద కుటుంబాలు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారో…. వారిని గ్రామ కమిటీ గుర్తించి నిర్దారణ చేయాలన్నారు. గ్రామస్తుల నిర్ణయం తరువాతనే అధికారులు పోడు రైతుల వివరాలను అప్రూవల్ చేయాలన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీ లను ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం చేసి నిజమైన పోడు రైతులను గుర్తించలన్నారు.ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సమన్వయముగా పని చేసి అటవీ భూములను పరిరక్షించాలన్నారు.

గతం లో ఏ ప్రభుత్వం అటవీ సంపదను పెంచేందుకు ఎలాంటి కార్యక్రమలను చేపట్టలేదని….. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దూరదృష్టి తో అటవీ విస్తరణ ను పెంచేందుకు హరితహారం కార్యక్రమమను రూపొందించి అటవీ శాతన్ని మన రాష్ట్రం లో గణనీయంగా పెంచారన్నారు. అట్టి అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవలిసిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ గారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి , జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరి సింగ్, ఫారెస్ట్ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat