బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మరుగుదొడ్డిని క్లీన్ చేసి సంచలనం సృష్టించారు. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా? మరుగుదొడ్డిని ఎంపీ క్లీన్ చేసింది వివిధ వస్తువలను ఉపయోగించి కాదు.. స్వతహాగా తన చేతులతో. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మౌగంజ్లో చోటుచేసుకుంది.
రీవా నుంచి ఎంపీగా గెలుపొందిన జనార్దన్హ మిశ్రా.. మౌగంజ్లోని గవర్నమెంట్ బాలిక పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. వెంటనే అక్కడకు వెళ్లి తన చేతులతోనే దాన్ని శుభ్రం చేయడం చర్చనీయాంశమైంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ ఎంపీ ఇలా తన చేతులతో మరుగుదొడ్డి క్లీన్ చేయడాన్ని అక్కడ అందరూ చర్చించుకుంటున్నారు.