సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా.. సునీల్ … అనసూయ.రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రలో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై .ఘన విజయం సాధించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ..ఈ సినిమాలోనేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా నటించి ఒకపక్క నటనను చూపిస్తూనే మరోవైపు తన అందాలను ఆరబోసి కనువిందు చేసింది.
ఈ మూవీలో తాను నటించిన శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది ఈ హాటెస్ట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఈ భామ ఉంది. ఈక్రమంలో ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా బాలీవుడ్ లో నటించిన ‘గుడ్బై’ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన వికాస్భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు.
ఈ చిత్రం గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తాను ఈ మూవీలో తారా భల్లా అనే యువతిగా నటిస్తున్నాను. ఒక కుటుంబ ప్రేమానుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రమిదని పేర్కొంది.మూఢ విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్ని ప్రశ్నిస్తూనే భావోద్వేగాల్ని చక్కగా అర్థం చేసుకునే అమ్మాయిగా తారా భల్లా పాత్ర తన కెరీర్లో ప్రత్యేకమని చెప్పింది. అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ విషయంలో గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ ‘నా మాతృభాష కన్నడ కాకుండా ఇతర ఏ భాషల్లోనైనా నాకు డబ్బింగ్ చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. హిందీలో మరింత కష్టంగా అనిపించింది. చివరకు చక్కటి శిక్షణతో విజయవంతంగా డబ్బింగ్ పూర్తిచేశా’ అని చెప్పింది.