Home / HYDERBAAD / ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?

ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో  ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా  ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సుమారు వెయ్యి మంది సైక్లిస్టులు కేబుల్‌ బ్రిడ్జిపై హాజరవుతారని సైక్లింగ్‌ సంఘం నిర్వాహకులు పేర్కొన్నారు.

దీంతో ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోటరీ, కేబుల్‌ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గచ్చిబౌలి రోడ్డు నంబర్‌-45, దుర్గంచెరువు, జూబ్లీహిల్స్‌ ఇనార్బిట్‌ మాల్‌, సీవోడీ జంక్షన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటల తర్వాత సాధరణ రాకపోకలు కొనసాగుతాయన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat