నల్లగా ఉన్నావ్.. అందంగా లేవ్ అంటూ భర్త పదేపదే ఆమెను బాడీ షేమింగ్ చేసేవాడు. కట్టుకున్న భర్తే కదా అని ఓపికతో భరించింది.. తాను బాధపడుతున్నా అలా ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంది. అయినా భర్త ఆగడాలకు అంతులేకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య జననాంగాలు కోసేసి, గొడ్డలితో నరికి చంపేసింది.
ఛత్తీస్గఢ్ దర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్వాని, సంగీత దంపతులు. సంగీత నల్లగా ఉండడంతో ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ.. అసహ్యంగా పిలిచేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపంతో సంగీత గొడ్డలితో నరికి భర్తను చంపేసింది. సోమవారం ఉదయం తన భర్తను ఎవరో హతమార్చారని గ్రామస్థులకు తెలిపింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా హత్య చేసినట్లు అంగీకరించింది.