దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్లోని మోకమా, గోపాల్గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. నామినేషన్ల స్వీకరణ 14 వరకు జరుగుతుంది. అక్టోబరు 15న నామపత్రాల పరిశీలన, 17న ఉపసంహరణకు గడువు. ఈ స్థానాలకు నవంబరు 3న పోలింగ్ నిర్వహించి 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ వెల్లడించింది.