ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరివని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జోస్యం చెప్పారు. నారా చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది..
ఇప్పటికైనా ఆయన మారాలని సూచించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను కోరుకుంటున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.