Home / MOVIES / నయనతార ,విఘ్నేశ్ గురించి కస్తూరి ట్వీట్.. వివాదంలో సీనియర్ నటి

నయనతార ,విఘ్నేశ్ గురించి కస్తూరి ట్వీట్.. వివాదంలో సీనియర్ నటి

సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న    సీనియర్  నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ  తల్లిదండ్రులైన విషయం తెలిసిందే.

కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరోగసిపై ప్రముఖ  నటి కస్తూరి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.తన ట్విట్టర్లో “భారతదేశంలో సరోగసి నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం.

ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం” అంటూ ట్వీట్ చేశారు.కస్తూరి ట్వీట్‌పై నయన్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘నీ పని నువ్వు చూసుకో అంటూ’ కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్‌ చేస్తున్న వారికి కస్తూరి ధీటుగా సమాధానమిచ్చారు. ‘అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకు ఉంది. నేను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్‌ పెట్టలేదు’ అంటూ బదులిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat