యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు.
ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పని చేశారని, ఎనలేని సేవలు అందించారని తెలిపారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ములాయం మృతి తో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.